ఎన్టీఆర్ `దేవర` షూటింగ్లో ప్రమాదం..? ఆసుపత్రిలో చేరిన 20 మంది ఆర్టిస్టులు.. ఫ్యాన్స్ లో ఆందోళన
ఎన్టీఆర్ నటిస్తున్న `దేవర` సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఇరవై మంది ఆర్టిస్టులు గాయపడ్డారట. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం `దేవర`. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఇది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండటం, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలున్నాయి. దీనికితోడు ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తుంది. దేవరగా, వరగా ఆయన కనిపిస్తారని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త షాకిస్తుంది. తారక్ అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుందట. ఇందులో సినిమా టీమ్కి సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు 20 మంది ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తుంది. సినిమా షూటింగ్లో తేనటీగలు దాడీ చేశాయట. తేనెటీగలు వెంబడించడంతో సుమారు 20 మందికి గాయాలు అయినట్టు తెలుస్తుంది. తేనెటీగలు కరవడం కారణంగా దాదాపు ఇరవై మంది యూనిట్కి చెందిన జూ ఆర్టిస్టులు, టెక్నిషియన్లు గాయాలపాలు అయ్యారని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదం వద్ద జరుగుతుందట. షూటింగ్ చేస్తున్న సమయంలో టీమ్పై తేనెటీగలు దాడి చేశాయని ఇందులో ఇరవై మంది గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారట. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఈ షూటింగ్లో ఎన్టీఆర్ లేరు. ఆయన ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు. `వార్ 2` షూటింగ్ కోసం గత వారం ఆయన ముంబయి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వారం మొత్తం అక్కడే ఉంటారని సమాచారం. అయితే ఈ సంఘటనకు సంబంధించిన నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. నిజమేనా, పుకార్ల అనేది క్లారిటీ రావాల్సి ఉంది. టీమ్ స్పందిస్తేగానీ క్లారిటీ వస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్10న విడుదల కానుంది. ఎన్టీఆర్ సోలోగా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది.భారీ స్థాయిలో దీన్ని విడుదల చేయబోతున్నారు.